News

ఈ నెల 30న తిరుమలకి కె.సి.ఆర్


రాష్ట్రం ఆవిర్భావించాక ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉమ్మడి రాష్ట్రంలోని తిరుపతి, కనకదుర్గమ్మ దేవాలయంతో పాటు ఇతర దేవుళ్లు దేవతలకు ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటానని కేసీఆర్ అప్పట్లో తెలిపారు. ఇప్పటికే తెలంగాణలోని దేవుళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈనెలాఖరు (30)న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి.. బంగారం రూపంలో మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం అటు నుంచే విజయవాడలోని కనక దుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు. అమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు